- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డాబాపై పడుకున్న 14ఏళ్ల బాలిక.. తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా డాక్టర్ వెళ్లి..
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారం, దాడుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్, రేపల్లెలో గ్యాంగ్ రేప్ ఘటనలు మరువకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలానికి చెందిన వేగి రమేశ్ ఆర్ఎంపీగా పని చేస్తున్నారు. అయితే ఆరు నెలల క్రితం ఏడో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థినికి వైద్యం చేశాడు. ఆ సమయంలో ఆ బాలిక వద్ద నుంచి ఆమె ఫోన్ నంబర్ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా బాలిక డాబాపై పడుకున్న సమయంలో వైద్యుడు డాబాపైకి వెళ్లాడు. నిద్రపోతున్న బాలికపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ విషయాన్ని బాలిక తమకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.