అందరూ ఐక్యంగా పని చేస్తే గెలుపు నల్లేరు మీద నడకే:శ్రీనివాస్

by Disha Web Desk 18 |
అందరూ ఐక్యంగా పని చేస్తే గెలుపు నల్లేరు మీద నడకే:శ్రీనివాస్
X

దిశ ప్రతినిధి, విజయనగరం:గజపతినగరం మండల పార్టీ సర్వసభ్య సమావేశం గంగ చోళ పెంట గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మీ నాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరూ ఐక్యతగా పనిచేయాలని అలా పనిచేస్తే గెలుపు నల్లేరు పై నడకని చెప్పారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి టీడీపీ,జనసేన,బీజేపీల ప్రభుత్వం అవసరమని లేకుంటే ఆంధ్రరాష్ట్రం ఆదోగతి పాలవుతుందని తెలిపారు.అందుకని అందరూ కలిసి పని చేద్దాం కలిసి గెలుద్దాం అని పిలుపునిచ్చారు.

మండలం లో వివిధ గ్రామాల నుంచి వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాలు కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ పార్టీ తీర్ధం తీసుకున్నారు.కార్యక్రమంలో ఎం.ఎల్.సి. సభ్యులు వేపాడ చిరంజీవులు , జనసేన పి.ఏ.సి.సభ్యులు పడాల అరుణ గారు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ,గజపతినగరం నియోజకవర్గం జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వర్ రావు, టీడీపీ పార్టీ సమన్వయకర్త సురేంద్ర మరియు మండలపార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇంచార్జిలు, బూత్ ఇంచార్జిలు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ, స్థానిక పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed