Left Parties: ఈ నెల 30న విశాఖలో మహాధర్నా

by Disha Web Desk 16 |
Left Parties: ఈ నెల 30న విశాఖలో మహాధర్నా
X

దిశ, గాజువాక: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ నెల 30 న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహా ధర్నాను నిర్వహించాలని వామ పక్ష పార్టీలు తీర్మానించాయి. శుక్రవారం గాజువాక సిపిఎం కార్యాలయం‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సీపీఐ గాజువాక నియోజక వర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పారు.

సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. ఐ.ఎఫ్.టి.యూ నాయకులు కె.మల్లయ్య మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలతో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గేవరకు పోరాటం చేస్తామని అన్నారు.



Next Story

Most Viewed