Ap Politics:ఆ నియోజకవర్గంలో విజయం మనదే:సీఎం జగన్

by Disha Web Desk 18 |
Ap Politics:ఆ నియోజకవర్గంలో విజయం మనదే:సీఎం జగన్
X

దిశ ప్రతినిధి,విజయనగరం: మన్యం జిల్లా సాలూరులో విజయం వైసీపీదే అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పాలూరు అభ్యర్థి పీడిక రాజన్న దొర, సాలూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు వి. శ్రీనివాస్ రెడ్డితో ఆయన మాట్లాడుతూ, సాలూరులో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, అమలు జరిపిన పథకాలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. మక్కువ జడ్పీటీసీ సభ్యుడు, బొబ్బిలి అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు మావూడి శ్రీనివాసరావు, మక్కువ మండలాధ్యక్షుడు మావూడి రంగు నాయుడు తదితరులు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వీరి వెంట ఉన్నారు.



Next Story

Most Viewed