- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
AP Politics:జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆ రెండు పార్టీల నేతలు
దిశ,ఏలూరు: ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ, జనసేన కీలక నేతలు వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర లో ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురం లో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం బస్సు యాత్ర సమయంలో జగన్ సమక్షంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత (2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి) చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు, తెలుగుదేశం పార్టీ నుంచి పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు తమ అనుయాయులతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అలాగే ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీ వీ రావు, జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ సంఘం నేత పచ్చిగోళ్ళ రామకృష్ణ తమ అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు నారాయణపురం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ను ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి జగన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి పి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తదితర నేతలు పాల్గొన్నారు