విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
విజయవాడ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో సిపి క్రాంతి రానా టాటా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీని కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. అయితే అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. జగన్‌పై దాడి కేసులో A2 నిందితుడుగా దుర్గారావు ఉన్నారు. ఈ మేరకు ఆయనను తమకు చూపించాలని సిపి క్రాంతి రానా టాటా కార్యాయలయం వద్ద భార్య , కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో పోలీసు స్టేషన్‌కు తరలించారు.

కాగా విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీఎం జగన్ కంటిపై భాగాన గాయమైంది. అయితే ఈ దాడికి పాల్పడిన వడ్డెర కులానికి చెందిన సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ2 నిందితుడిగా ఉన్న దుర్గారావును పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గారావు భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దుర్గారావును రహస్యంగా విచారిస్తుండటంతో ఆయన ప్రాణానికి హాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు ఒప్పుకోవాలంటూ దుర్గారావుపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed