Srikakulam: కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

by Disha Web Desk 16 |
Srikakulam: కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి పాలిట లారీ మృత్యువు రూపంలో దూసుకువచ్చింది. అంతే ముగ్గురు కూలీలను పొట్టనబెట్టుకుంది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం మందడిలో చోటు చేసుకుంది. మందడిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మీగా గుర్తించారు. అయితే అమలాపురం గౌరవమ్మకు తీవ్ర గాయాలు కాగా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమె పరిస్థతి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం రిమ్స్ వద్ద మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.


Next Story

Most Viewed