సిద్దమైన తాడేపల్లిగూడెం జెండా సభా ప్రాంగణం.. వీడియో వైరల్

by Disha Web Desk 5 |
సిద్దమైన తాడేపల్లిగూడెం జెండా సభా ప్రాంగణం.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ- జనసేన పార్టీలు బుధవారం తాడేపల్లి గూడెంలో నిర్వహించబోయే జెండా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు దాదాపు 25 లక్షల మంది హజరు అవుతారని అంచనాతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు పార్టీల నుంచి 250 మంది నాయకులు కూర్చునే విధంగా సభా వేదికను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం జెండా సభకు సిద్ధం చేసిన సభా ప్రాంగణం వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ సభ ఏర్పాట్లను పరిశీలించిన తాడేపల్లి గూడెం జనసేన ఇన్ చార్జి బొలిశెట్టి శ్రీను జనసేన హోస్ట్ గా, టీడీపీ గెస్ట్ గా వ్యవహరించనున్నాయని, జనసైనికులు, వీర మహిళలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

Next Story

Most Viewed