అలా జరిగి ఉంటే జగన్ స్పాట్‌లోనే చనిపోయేవారు?: పోసాని

by Disha Web Desk 16 |
అలా జరిగి ఉంటే జగన్ స్పాట్‌లోనే చనిపోయేవారు?: పోసాని
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్‌నగర్‌లో గులకరాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీశ్‌కు కోర్టు రిమాండ్ విధించింది. మరో నిందితుడు దుర్గారావును పోలీసులు విచారించి ప్రమేయం లేదని తేలడంతో ఆయన్ను వదలిశారు. కానీ ఈ ప్రకంపనలు రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాయి ఎటాక్ టీడీపీ నేతల పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


తాజాగా పోసాని కృష్ణమురళి స్పందించారు. గులకరాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్‌లోనే చనిపోయేవారని పోసాని అన్నారు. ముఖ్యమంత్రినే చంపాలనుకున్నవారికి తామొక లెక్కా అని ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మనూ గతంలో చంపాలని చూశారని, కానీ చంద్రబాబు నో చెప్పారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా రాష్ట్రంలో మర్డర్లు జరగవని పోసాని ఆరోపించారు.



Next Story

Most Viewed