పేటలో జన జాతరను తలపించిన వైసీపీ అభ్యర్థి నామినేషన్!

by Disha Web Desk 18 |
పేటలో జన జాతరను తలపించిన వైసీపీ అభ్యర్థి నామినేషన్!
X

దిశ,నరసరావుపేట:వైసీపీ శ్రేణులు బుధవారం పేటలో కదం తొక్కారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ జరిగింది. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్ కార్యక్రమంకు ముందు రెడ్డి నగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు జరిపారు. నియోజకవర్గం లోని మహిళలు వారికి మంగళహారతులు పట్టి, గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , జై జగన్ నినాదాలతో పేట రహదారులు మారుమోగాయి.

మండుటెండను సైతం లెక్కచేయకుండా నామినేషన్ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో రెడ్డి నగర్,పల్నాడు బస్టాండ్ సెంటర్,అంబేద్కర్ విగ్రహం సెంటర్,శివుని బొమ్మ సెంటర్,మల్లమ్మ సెంటర్ మీదుగా గడియార స్తంభం,మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఆర్ డి ఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దీంతో పేట రహదారులన్నీ వైసీపీ అభిమానులతో కిక్కిరిసాయి.ఆ తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొత్తం మీద గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్ కార్యక్రమం జన జాతరను తలపించింది.



Next Story

Most Viewed