- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Ap Politics:గెలిచి అసెంబ్లీకి రావాలి:టీడీపీ అధినేత
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో కలవాలని విశాఖ ఉత్తర బీజేపీ అభ్యర్థి పి.విష్ణు కుమార్ రాజుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం రాత్రి విశాఖ విమానాశ్రయంలో విష్ణు మర్యాద పూర్వకంగా చంద్రబాబు నాయుడును కలిశారు. 2014-19 సంవత్సరాల మధ్య బీజేపీ పక్ష నేతగా అసెంబ్లీలో క్రియాశీలక పాత్ర పోషించిన మీరు తిరిగి ఎన్నికై రావాలని ఆకాంక్షించారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల సంపూర్ణ మద్దతు ఉంటుందని, మూడు పార్టీల నేతలు, కార్యకర్తల సహకారంతో మంచి మెజారిటీతో విజయం సాధించాలని అన్నారు. నామినేషన్ల గడువు ముగిసినందున ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. విశాఖ నుంచి ఎంపీ , ఎమ్మెల్యేలు కూటమి నుంచే రావాలని చంద్రబాబు అభిలాషించారు. తన పట్ల చూపిన ఆదరాభిమానాలు, మద్దతుకు విష్ణుకుమార్ రాజు ధన్యవాదాలు తెలిపారు. తిరిగి సీఎంగా చంద్రబాబుని చూస్తామని అన్నారు.
Read More..
మరో మలుపు తిరిగిన ఏపీ రాజకీయం.. తన పేరే పవన్ కళ్యాణ్ను ఓడిస్తుందా?