చెక్ పోస్ట్ తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్..

by Disha Web Desk 18 |
చెక్ పోస్ట్ తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్..
X

దిశ,కళ్యాణదుర్గం:కంబదూరు మండలం కేంద్రానికి సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర కర్ణాటక సరిహద్దు చెక్ పోస్టును గురువారం ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్య ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు.కంబదూరు సెబ్ పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా కర్ణాటక మద్యం రవాణా కాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట సెబ్ సీఐ తక్కి భాష, అనంతపురం సీఐ రమేష్, సెబ్ ఎస్ఐ వెంకటరత్నం తదితర అధికారులు ఉన్నారు.


Next Story