ఆంధ్రా యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం జగన్

by Dishafeatures2 |
ఆంధ్రా యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం జగన్
X

దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంగళవారం మద్యాహ్నం గం.01.39ని.కు సీఎం వైఎస్ జగన్ సిరిపురం వద్దనున్న ఫార్మ ఇంక్యుబేషన్, బయో మానిటరింగ్ హబ్-ఎలిమెంట్ కి చేరుకున్నారు. ఎలిమెంట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అదే వేదిక నుంచి మరో నాలుగు భవనాల శిలాఫలకాల ఆవిష్కరించి ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 ప్రాజెక్టులు చేపట్టగా, వీటిలో ఐదు ప్రాజెక్ట్ లను మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభించారు. అవి టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్`ఆ హబ్, ఫార్మ ఇంక్యుబేషన్ ` ఎలిమెంట్, ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్`అల్గారిథమ్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్ లను ప్రారంభించారు.

ఆంధ్ర విశ్వ విద్యాలయంలో యువతను ఆవిష్కర్తలగా తీర్చిదిద్దడానికి ఉపయుక్తంగా నిలిచే ఈ ఐదు కేంద్రాల ప్రత్యేకతలను, పనితీరు, ప్రగతిని ఏయూ వీసీ ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి కి వివరించారు. ఎలిమెంట్ భవనంలో ఏర్పాటుచేసిన ఫార్మసీ లేబరేటరీని ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడ ఉన్న ఉపకరణాలు పనితీరు తెలుసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థులకు ఉపయుక్తంగా అభివృద్ధి చేసిన భవనాలు ప్రాజెక్టులను ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కే హేమచంద్ర రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.స్యామలరావు, ఏయూ రెక్టర్ ఆచార్య కె.సమత, రిజిస్త్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, అవంతి ఫీడ్స్ అధినేత ఇంద్ర కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవి ఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాధన్, ఏయూసెనేట్ సభ్యులు డాక్టర్ కుమార్ రాజా, ప్రిన్సిపాల్ ఆచార్య వై రాజేంద్రప్రసాద్, కె.శ్రీనివాసరావు, జి.సషి భూషణరావు, ఏ నరసింహారావు, టి. శోభ శ్రీ, ఎస్. కె భట్టి, అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. జేమ్స్ స్టీఫెన్, incubation సెంటర్ సీఈవో రవి ఈశ్వరపు, ఆచార్య కృష్ణ మంజరి పవర్, టి.షారోన్ రాజు ఆచార్య ఎన్ఏడి పాల్, ఆచార్య కె. బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ఏయూ ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులను ముఖ్యమంత్రికి వీసీ ప్రసాద్ రెడ్డి స్వయంగా పరిచయం చేశారు. ఎలిమెంట్ భవనం బయట పెద్ద సంఖ్యలో విద్యార్థులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వీరికి ముఖ్యమంత్రి చిరునవ్వుతో అభివాదం చేస్తూ పలకరించారు.

ప్రారంభోత్సవ భవనాల వివరాలు

ఆ హబ్..

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆవిష్కర్తలుగా, భవిష్యత్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే వేదికగా ఆ హబ్ని తీర్చిదిద్దారు. ఇంజనీరింగ్ కళాశాలలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ 21 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనిలో ఇప్పటికే 121 స్టాప్టప్లు పనిచేస్తూ వీటిలో 114 వరకు ఆర్ధిక వనరులను సృష్టించే స్థాయికి చేరుకున్నాయి.

ఎలిమెంట్..

ఫార్మ ఇంక్యుబేషన్, బయోలాజికల్ మానిటరింగ్ హబ్గా ఎలిమెంట్ను ఏర్పాటు చేసారు. దాదాపు 55 వేల సదరపు అడుగుల విస్తీర్ణంలో ఫార్మ, బయో, జినోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్గా దీనిని దాదాపు 44 కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేసారు. ఔషధ రంగాలలో స్టార్టప్ ఇన్నోవేషన్ ని ప్రోత్సహించే విధంగా ఎలిమెంట్ ఏర్పాటు చేసారు.

అల్గారిథం..

ఆంధ్రవిశ్వవిద్యాలయం డిజిటల్ జోన్, స్మార్ట్ క్లాస్రూం కాంప్లెక్స్ని అల్గారిథంగా పేరు పెట్టారు. ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఎదురుగా 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ 35 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించడం జరిగింది. ఈభవనంలో 250 మంది కూర్చునే సామర్ధ్యం కలిగిన సెమినార్ హాళ్లు 2, స్మార్ట్ క్లాస్ రూమ్లు 15, ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు ఉపయుక్తంగా 500 కంప్యూటర్లతో కూడిన ఒక పూర్తి అంతస్థును కలిగి ఉంది.

ఏయూ సిబ్..

ఆంధ్రయూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్( ఏయూ సిబ్)ని ఏయూ అవుట్గేట్కి అనుకుని ఏర్పాటు చేసారు. 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మాణానికి రూ 15 కోట్లు ఖర్చుచేసారు. ఐఐఎం విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం చేసుకుని ఏయూ సిబ్ నుంచి ఎంబిఏ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్, అనలటిక్స్ రంగాలలో బ్యాచిలర్, పీజీ కోర్సులకు ఈ కేంద్రంలో నిర్వహిస్తారు.

ఏయూ`అవంతి ..

బీచ్ రోడ్డులో ఏయూ`అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్ ని 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. తొలి దశలో దాదాపు రూ 11 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేసారు. అవంతి ఫౌండేషన్తో చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా మెరైన్ ఫార్మింగ్ రగంలో నైపుణ్య శిక్షణ, ఎంటర్ప్యూనర్షిప్ను ప్రోత్సహించే దిశగా ఈ కేంద్రం సేవలు అందిస్తుంది.

Next Story