శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

by Disha Web Desk 18 |
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
X

దిశ,తిరుమల:శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య,ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్, తిరుపతి జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మాజీ ఎంపీ గురుమూర్తి, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, తెలంగాణ బీసీ కమిషనర్ చైర్మన్ కృష్ణమోహన్ రావు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.అలాగే ఈ రోజు శ్రీవారి దర్శనానికి ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు హీరో రాజేంద్ర ప్రసాద్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్,తిరుపతి ఫారెస్ట్ డి ఎఫ్ ఓ సతీష్ కుమార్ ఉన్నారు. దర్శనానంతరం వీరిని ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


Next Story