Ap Politics:వైసీపీకి బిగ్ షాక్..రాజీనామా చేసిన అన్నా రామచంద్రయ్య?

by Disha Web Desk 18 |
Ap Politics:వైసీపీకి బిగ్ షాక్..రాజీనామా చేసిన అన్నా రామచంద్రయ్య?
X

దిశ,తిరుపతి: వైసీపీ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన అన్నా రామచంద్రయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.తాజాగా కార్పొరేషన్ పరిధిలోని 48 ,49 డివిజన్ల కార్పొరేటర్ అన్నా సంధ్యా యాదవ్, డాక్టర్ అన్న అనితా యాదవ్ లు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారి తండ్రి అన్నా రామచంద్రయ్య యాదవ్ కలిసి మీడియాకు చూపించారు.తన తండ్రి పై వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు దూషములకు దిగడం తమకు బాధ కలిగిందని అందుకే వైఎస్సార్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

తమ డివిజన్ ప్రజలతో చర్చించి త్వరలో కార్పొరేటర్ పదవులకు సైతం రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. రెండురోజుల ముందు అన్నా రామచంద్రయ్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీని ఎందుకు విడారో కారణాలు మాత్రం తెలియజేయడం లేదు.తిరుపతి నగరంలో అత్యధిక ఓటింగ్ శాతం కలిగిన జీవకోన ప్రాంతంలో అన్నా రామచంద్రయ్య యాదవ్ కి మంచి పట్టుంది.


Next Story

Most Viewed