చెత్త విషయంలో గొడవ.. ఐదుగురిపై ఇసుప రాడ్డుతో దాడి

by Disha Web Desk 16 |
చెత్త విషయంలో గొడవ.. ఐదుగురిపై ఇసుప రాడ్డుతో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం నెమళ్ళగుంట గ్రామంలో ఘర్షణ జరిగింది. ఇంటి ముందు చెత్తని పక్కింటి వైపు వేయడంతో వివాదం తలెత్తింది. దీంతోభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇసుప రాడ్డుతో ఐదుగురిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story