ఎన్నికల వేళ కీలక పరిణామం..చంద్రబాబుతో చిరంజీవి భేటీ?

by Disha Web Desk 18 |
ఎన్నికల వేళ కీలక పరిణామం..చంద్రబాబుతో చిరంజీవి భేటీ?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక పార్టీ నేతలు సైతం సభలు, సమావేశాలతో దూసుకెళ్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా చిరంజీవి కూడా ప్రచారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడి గెలుపే లక్ష్యంగా ప్రచారం జోరు పెంచారు. ఇక కూటమికి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మే 11న విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబును చిరంజీవి కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వీరిద్దరూ వర్తమాన రాజకీయాల పై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబుతో భేటీ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More : పవన్ కోసం చిరు ఎమోషనల్ పోస్ట్?

Next Story

Most Viewed