- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలి : ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ, హుజూర్ నగర్ : ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీ సాధిస్తారని అన్నారు. ఉప ఎన్నిక జరిగే మూడు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ స్థానాలకు గాను 32 స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు.
జూన్ 4 న రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరా రెడ్డి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయం చేసి ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగులకు కల్పించే ఉద్యోగ భృతిని తెలియజేసి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.
పట్టభద్రుల కు అండగా కాంగ్రెస్ పార్టీ
పట్టభద్రులకు అండగా కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అందుబాటులో ఉంటుందని పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో ప్రచారం చేసి ఓటు వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. మోడీ ప్రభుత్వంలో పేద ప్రజలపై పెను భారం మోపి ప్రజలను మోసం చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులను పట్టించుకోకుండా హేళన చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి పట్టభద్రుని కలిసి ఓటు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ పాల్గొన్నారు.