Nara Chandrababu Naidu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు చంద్రబాబు

by Dishafeatures2 |
Nara Chandrababu Naidu : నేడు కుటుంబసమేతంగా తిరుమలకు చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కుటుంబసమేతంగా తిరుమల వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమలలో బస చేయనుండగా.. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఇవాళ మధ్యాహ్నం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి 5 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 6.15 గంటలకు తిరుమలకు చంద్రబాబు చేరుకుంటారు.

గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 9.45 గంటల మధ్య వరాహస్వామిని దర్శించుకోనుండగా.. 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లో కంటి చికిత్స తీసుకోనున్నారని తెలుస్తోంది.

Next Story

Most Viewed