బ్రేకింగ్..చంద్రబాబు పై చర్యలకు సీఈఓ సిఫార్సు

by Disha Web Desk 18 |
బ్రేకింగ్..చంద్రబాబు పై చర్యలకు సీఈఓ సిఫార్సు
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు పై చర్యలకు ఈసీకి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా సిఫార్సు చేసింది. బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైసీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు సీఈఓ పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు మరికొన్ని నోటీసులకు స్పందించలేదు. దీంతో చంద్రబాబు ఇచ్చిన సమాధానలపై సీఈఓ మీనా సంతృప్తి చెందలేదు. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించారు. బాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్‌కు సీఈఓ మీనా లేఖ రాశారు. చంద్రబాబు ప్రసంగాల క్లిప్పింగ్‌లను కూాడా జతపరిచారు.



Next Story

Most Viewed