ఏపీ డీజీపీని బదిలీచేయండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు

by Disha Web Desk 16 |
ఏపీ డీజీపీని బదిలీచేయండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
X

దిశ , ఏపీబ్యూరో: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో బీజేపీ నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పొలిటికల్‌ సర్వీసు అధికారులుగా మారిపోయారని బీజేపీ సీనియర్‌ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలపై దాడులు జరుగుతున్నా, శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా డీజీపీ పట్టించుకోవటం లేదన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించాలని ఇప్పటికే రెండు సార్లు ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల జారీలో ఎన్నికల అధికారులు నిబంధనలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్న 10లక్షల మందికి పోస్టల్‌ ఓట్లు ఉన్నా కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి పోస్టల్‌ బ్యాలెట్ల నమోదుకు సమయం పెంచాలని విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed