కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

by Disha Web Desk 18 |
కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ,కుక్కునూరు:ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో, 2024-25 విద్యా సంవత్సరానికి 6,7,8,9 తరగతులకు అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ, ఎంపీసీ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ప్రత్యేక అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 11 లోగా విద్యార్థులు ఆన్లైన్ లో https://apkgbv.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.అనాధ పిల్లలు, బడి మానేసిన వారు ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన( బీపీల్)జీవిస్తున్న బాలికలు మాత్రమే ఈ ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి వాళ్ళ ఫోన్ నెంబర్లకు మెసేజ్ రూపంలో సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆయా విద్యాలయాల స్పెషల్ ఆఫీసర్లు తెలిపారు.



Next Story

Most Viewed