Ycp Tdp Fight: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2022-11-23 15:04:34.0  )
Ycp Tdp Fight: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత
X

దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. ఈ దాడిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. గత కొద్ది రోజులుగా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ చిన్న గొడవ జరిగినా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. తాజాగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

పథకాల మాటున ఒక్కో కుటుంబం నుంచి లక్ష వసూళ్లు!

Next Story

Most Viewed