బీజేపీ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రారంభిస్తున్న ప్రజా పోరు కార్యక్రమం..

by Disha Web Desk 18 |
బీజేపీ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రారంభిస్తున్న ప్రజా పోరు కార్యక్రమం..
X

దిశ, ఉరవకొండ: పట్టణంలోని మల్లీశ్వరి దేవాలయంలో పూజలు చేసి పాతపేట, మల్లేశ్వరం దేవాలయం, ఇందిరా నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉరవకొండ అసెంబ్లీ కన్వీనర్ కొనకొండ్ల రాజేష్ మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరు కార్యక్రమం ప్రారంభం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉదేశ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి, కేంద్రం నిధులను తమ నిధులు అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం గురించి ప్రజలకు తెలియజేస్తామన్నారు. పీఎం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ మాలపాటి హరి, వెలిగొండ సిద్ధప్ప, లక్ష్మీ నారాయణ, ఆచారి, గోపాల్, లాలప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More..

విశ్వన్నకు మద్దతుగా గిరిజనులు ఇంటింటి ప్రచారం..



Next Story

Most Viewed