Vishaka: ఎర్రటి ఎండలో అనూహ్య ఘటన.. ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు

by Disha Web Desk 16 |
Vishaka: ఎర్రటి ఎండలో అనూహ్య ఘటన.. ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ గోపాలపట్నం జంక్షన్‌లో అనూహ్య ఘటన జరిగింది. నాలుగు రోడ్ల జంక్షన్‌లో అందరూ చూస్తుండగా ఎర్రటి ఎండలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ కారు నుంచి దిగి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తం కావడంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మంటల్లో కారు కాలి బూడిదైపోయింది.


ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు. దగ్గర్లో పెట్రోల్ బంకు ఉండటంతో ఏం జరుగుతుందోనని కంగారు పడిపోయారు. చివరకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కావడంతో వాహనదారులు ఫైర్ సెప్టీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story