లోయర్ మానేరు డ్యామ్‌లో యువతి డెడ్‌ బాడీ.. అసలేం జరిగింది.?

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యామ్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం చేపలు పట్టేవాళ్ళు డెడ్ బాడీ నీటిలో తెలియాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి వయసు 20-25 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

Update: 2021-11-23 22:38 GMT

దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యామ్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం చేపలు పట్టేవాళ్ళు డెడ్ బాడీ నీటిలో తెలియాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి వయసు 20-25 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Tags:    

Similar News