‘పారమిత’ విద్యార్థుల ప్రతిభ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.

Update: 2024-05-01 08:43 GMT

దిశ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో పారమిత ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పారమిత స్టేట్ సిలబస్ కేవలం పారమిత ఉన్నత పాఠశాలలోనే ఉన్నది. ఈ ఫలితాలు కేవలం పారమితకు సంబంధించిన ఒకే పాఠశాలది. మొత్తం 210 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 24 మంది విద్యార్థులు 10 జీ.పి.ఏ, 20 మంది విద్యార్థులు 9.8 జీ.పి.ఏలు సాధించారు. 210 మంది విద్యార్థులల్లో 37 శాతం విద్యార్థులు 9.5 జీ.పి.ఏ.,61 శాతం విద్యార్థులు 9 ఆపై జీ.పి.ఏ., 85 శాతం విద్యార్థులు 8 జీ.పి.ఏలు సాధించారు. ఆంగ్ల భాషలో 9 ఆపైన జీ.పి.ఏలు 88 శాతం మంది విద్యార్థులు సాధించి ఆశ్చర్యకరమైన అత్యుత్తమ ఫలితాలను సాధించారు

పారమిత విద్యాసంస్థలలో నైపుణ్యాలకు పెద్దపీట వేసి ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా విద్యార్థులను అన్నిరంగాలలో తీర్చి దిద్దడం జరుగును. ఈ పద్ధతిలో ఎక్కడా కూడా గ్రేడులు సాధించడానికి విద్యార్థులను బట్టి విధానానికి ప్రోత్సహించడం జరగదు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డా.ఇ. ప్రసాద రావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రశ్మిత ప్రసాద్, రాకేష్, ప్రాచీ, వినోదరావ్, వి.యు. ఎం. ప్రసాద్, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవిత ప్రసాద్, ఉపాధ్యాయలు అభినందించారు. పాఠశాలకు ఉత్తమ సహకారాన్నందించిన తల్లిదండ్రులకు చైర్మన్ డా.ఇ. ప్రసాద్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు


Similar News