వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన ప్రకటన

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గనులు కేటాయిస్తే రాష్ట్రప్రభుత్వమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేస్తుందని ట్వీట్ చేశారు. “వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ చేసిన నిర్మాణాత్మక సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు. గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వస్తుందని ప్రధానికి లేఖ రాశారు. అవసరమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను తామే కొనుగోలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించిందని […]

Update: 2021-02-09 00:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గనులు కేటాయిస్తే రాష్ట్రప్రభుత్వమే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనుగోలు చేస్తుందని ట్వీట్ చేశారు. “వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ చేసిన నిర్మాణాత్మక సూచనలను అందరూ స్వాగతిస్తున్నారు. గనులు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ లాభాల్లోకి వస్తుందని ప్రధానికి లేఖ రాశారు. అవసరమైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను తామే కొనుగోలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అరుదైన సాహసాన్ని ప్రదర్శించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

Tags:    

Similar News