చంద్రబాబుకు మద్దతు ప్రకటించిన ముస్లిం లా బోర్డు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబును సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు బుధవారం కలిశారు.

Update: 2024-05-08 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబును సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు బుధవారం కలిశారు. టీడీపీకి సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు రాషిద్ షరీఫ్ మాట్లాడారు. లౌకికవాదానికి చంద్రబాబు ఐకాన్ అని కొనియాడారు. మత సామరస్యాన్ని కాపాడటంలో టీడీపీ ముందుంటుందన్నారు. చంద్రబాబు సామాజిక సమతుల్యాన్ని పాటిస్తున్నారన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టో మైనార్టీల అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. ముస్లింల అభివృద్ధికి తోడ్పడే మేనిఫెస్టో పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.  

Read More...

ప్రధాని మోడీ రోడ్ షోకు ఇసుకేస్తే రాలనంత జనం (వీడియో) 

Similar News