పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఉరట

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు భారీ ఉరట లభించింది. తోషా ఖానా కేసు తీర్పు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మరోసారి ఇమ్రాన్ కోర్టును ఆశ్రయించగా..

Update: 2023-08-29 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు భారీ ఉరట లభించింది. తోషా ఖానా కేసు తీర్పు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మరోసారి ఇమ్రాన్ కోర్టును ఆశ్రయించగా..ఆయన పై విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌ ఫరూక్‌, జస్టిస్‌ తారిఖ్‌ మెహమూద్‌ జహంగిరితో కూడిన డివిజన్‌​బెంచ్‌ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన బెయిల్‌పై విడుదల కానున్నారు. కాగా రాష్ట్ర గిఫ్ట్ రిపోజిటరీ అయిన తోషాఖానాకు సంబంధించిన విషయాలలో అవినీతికి పాల్పడినట్లు జిల్లా,సెషన్స్ కోర్టు నిర్ధారించింది. శిక్ష కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఏ ప్రభుత్వ పదవికి కూడా అనర్హుడయ్యాడు. ఈ నెల ప్రారంభంలో కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే ఆయనను అరెస్టు చేశారు.

Tags:    

Similar News