విశాఖలో టర్కీ నోట్ల కలకలం

దిశ,విశాఖపట్నం: విశాఖలో టర్కీ దేశపు దొంగనోట్లను చలామణి చేస్తున్న ఆరుగురు నిందుతుల ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు విశాఖలోని విఎస్‌ కృష్ణకాలేజీ సమీపంలో దొంగనోట్లను చలామణి చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ఎంవీపీ స్టేషన్‌ సిఐ రమణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి నిందుతులను పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు ఐదులక్షల విలువైన 300 టర్కీ కరెన్సీ నోట్లను, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సిఐ రమణయ్య తెలిపారు. […]

Update: 2020-12-02 08:26 GMT

దిశ,విశాఖపట్నం: విశాఖలో టర్కీ దేశపు దొంగనోట్లను చలామణి చేస్తున్న ఆరుగురు నిందుతుల ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు విశాఖలోని విఎస్‌ కృష్ణకాలేజీ సమీపంలో దొంగనోట్లను చలామణి చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో ఎంవీపీ స్టేషన్‌ సిఐ రమణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి నిందుతులను పట్టుకున్నారు. వీరి నుంచి సుమారు ఐదులక్షల విలువైన 300 టర్కీ కరెన్సీ నోట్లను, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సిఐ రమణయ్య తెలిపారు. కమిషన్‌ కోసం కక్కుర్తిపడిన కారణంగానే ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. రెడ్‌హ్యాండడ్‌గా దొరికిన ఆరుగురిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు.

Tags:    

Similar News