తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని, దీనికి తాజా పరిణామాలే నిదర్శమన్నారు. చినుకుపడితే జలమయం అయ్యే భాగ్యనగరాన్ని ఎలాగూ కాపాడలేక పోయారన్న రాములమ్మ.. ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనంతో వరంగల్ కూడా బలైందని ఆరోపించారు. భూ కబ్జాల విషయంలో రెవెన్యూశాఖ ఏవిధంగా స్పందిస్తుందో తెలుస్తుందన్నారు. కోటి రూపాయల లంచం ఘటనే దీనికి ఉదాహారణగా చెప్పుకొచ్చారు.గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలు జరిగినా పట్టించుకోవడం లేదని, […]

Update: 2020-08-18 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని, దీనికి తాజా పరిణామాలే నిదర్శమన్నారు. చినుకుపడితే జలమయం అయ్యే భాగ్యనగరాన్ని ఎలాగూ కాపాడలేక పోయారన్న రాములమ్మ.. ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనంతో వరంగల్ కూడా బలైందని ఆరోపించారు. భూ కబ్జాల విషయంలో రెవెన్యూశాఖ ఏవిధంగా స్పందిస్తుందో తెలుస్తుందన్నారు. కోటి రూపాయల లంచం ఘటనే దీనికి ఉదాహారణగా చెప్పుకొచ్చారు.గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలు జరిగినా పట్టించుకోవడం లేదని, హైకోర్టు మొట్టికాయలు వేసినా స్పందించకపోవడం దారుణమన్నారు.

Tags:    

Similar News