సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి.. కీలక హామీ

రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

Update: 2024-05-04 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కాగా శుక్రవారం తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని.. ఫేక్ సర్టీఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రోహిత్ వేముల తల్లి సీఎం ను కలిసి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. కాగా ఈ కేసును రీఓపెన్ చేశామని.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు రాధిక వేముల సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News