బాబు చేస్తున్న గలీజు పనులు ఇవే: విజయసాయిరెడ్డి

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలపై మరోసారి ఫైరయ్యారు. ‘బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు’ అని ట్విట్ చేశాడు. మరో ట్విట్ లో ‘ఏడాదిలోనే 90 శాతం […]

Update: 2020-06-23 23:46 GMT

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలపై మరోసారి ఫైరయ్యారు. ‘బాబు హైదరాబాద్ లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యవహారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు’ అని ట్విట్ చేశాడు.

మరో ట్విట్ లో ‘ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ తపన పడుతుంటే బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్టవేసి కుట్రలకు తెగబడ్డారు. వాళ్లకు రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అని వాళ్లు స్కెచ్ లు వేస్తున్నారు’ అని ఆయన అందులో పేర్కొన్నారు.

Tags:    

Similar News