టీటీడీ సంచలన నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై నమోదైన పరువు నష్టం కేసులను కొనసాగించాలంటూ టీటీడీ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ  టీటీడీ మరో పిటిషన్ వేసింది. రూ.200 కోట్ల పరువు నష్టం దావాను యదాతథంగా కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని టీటీడీ కోర్టును కోరింది. 2018 లో నమోదైన ఈ కేసులో నేడు విచారణ […]

Update: 2020-11-16 06:42 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై నమోదైన పరువు నష్టం కేసులను కొనసాగించాలంటూ టీటీడీ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసులను వెనక్కి తీసుకునేలా ఇదివరకు దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేయాలంటూ టీటీడీ మరో పిటిషన్ వేసింది. రూ.200 కోట్ల పరువు నష్టం దావాను యదాతథంగా కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని టీటీడీ కోర్టును కోరింది. 2018 లో నమోదైన ఈ కేసులో నేడు విచారణ జరిపిన తిరుపతి పదో అదనపు జిల్లా కోర్టు… తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

 

 

 

Tags:    

Similar News