ఈ నెల 19న కేబినెట్ భేటీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు, తదితర విషయాలపై కేబినెట్ చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 తరువాత లాక్‌డౌన్‌ను సడలిస్తే వైరస్ మళ్లీ విజ‌ృంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా […]

Update: 2020-04-16 00:57 GMT

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు, తదితర విషయాలపై కేబినెట్ చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 20 తరువాత లాక్‌డౌన్‌ను సడలిస్తే వైరస్ మళ్లీ విజ‌ృంభించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించాలా..? లేక సడలించాలా..? అనే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags: ts cabinet, cm kcr, corona, lockdown

Tags:    

Similar News