రాత్రి 9 తర్వాత ఫోన్ చేసిన పవన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పోసాని

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో జరిగిన ఘటనపై పోసాని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2024-04-27 15:37 GMT

దిశ, వెబ్ డెస్క్: గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో జరిగిన ఘటనపై పోసాని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి ఏం మాట్లాడతావ్ అంటూ స్ట్రాంగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా పోసాని కృష్ణ మురళి మీడియాతో వెల్లడించారు. గబ్జర్ సింగ్ సినిమా షూటింగ్ కోసం నేను రాత్రి. 7 నుంచి 9 గంటల వరకూ టైమ్ ఇచ్చా. అయితే ఆ సమయంలో పవన్ కల్యాణ్ రాలేదు. 9 గంటల వరకూ చూసి వెళ్లిపోయా. ఏ సినిమా షూటింగ్ కోసమైనా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ సమయం కేటాయిస్తా. ఆ తర్వాత ఉండను.. అత్యవసరం అనుకుంటే డైరెక్టర్ల రిక్వెస్ట్ మేరకు రాత్రి 7 గంటల నుంచి 9 గంట వరకూ సమయం ఇస్తా. పవన్, నా మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించేందుకు గబ్బర్ సింగ్ -2 సినిమా కోసం కూడా అలాగే సమయం ఇచ్చా. రాత్రి 7 గంటల నుంచి ఎదురు చూశా. రాత్రి 9 అయినా పవన్ రాలేదు. దాంతో నేను వెళ్లిపోయా. నేను వెళ్లి అన్నం తింటున్నా. ఆ సమయంలో నాకు పవన్ ఫోన్ చేశారు. ఏంటి పవన్ అని అడిగా. మేం పిచ్చోళ్లమా అంటూ షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహంగా మాట్లాడారు. దాంతో నాకు కోపం వచ్చింది. నా భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆ విషయాన్ని ముందుగానే డైరెక్టర్‌కు చెప్పా. అందుకే నేను వచ్చేశాను. నువ్వే ఏం మాట్లాడుతున్నావ్.. కావాలంటే రేపు మీరు మా ఇంటికి రండి. మాట్లాడదాం. నువ్వు హీరో అయితే ఏంటి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. దాంతో కొంత సేపు పవన్ ఏమీ మాట్లాడలేదు. నా భర్యకు ఆపరేషన్ జరగడం వల్ల వెళ్లిపోయిన విషయాన్ని డైరెక్టర్ ద్వారా పవన్ తెలుసుకున్నారనుకుంటా. ఆ తర్వాత సరేనండి రేపు షూటింగ్‌కు రండి అని ఫోన్ పెట్టేశారు.’ అని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. 

Similar News