నోముల భగత్ నామినేషన్.. వెంట వెళ్లింది వాళ్లే..

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ దాఖలు చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. భగత్ నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మ‌ల్లయ్య యాద‌వ్, భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు హాజ‌రయ్యారు. నామినేషన్ దాఖలుకు భగత్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, […]

Update: 2021-03-30 02:40 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్ దాఖలు చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంగళవారం నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. భగత్ నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు బొల్లం మ‌ల్లయ్య యాద‌వ్, భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నప రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు హాజ‌రయ్యారు. నామినేషన్ దాఖలుకు భగత్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి మాత్రమే కార్యాలయం లోపలికి వెళ్లారు. అంతకు ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యాకర్తలతో ఆర్వో కార్యాలయం వరకు వెళ్లారు.

Tags:    

Similar News