నాయిని గొప్ప కార్మిక నాయకుడు !

దిశ, ముషీరాబాద్: మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గొప్ప కార్మిక నాయకుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నేత కందూరు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలో నాయిని నరసింహారెడ్డి, అహల్య దంపతుల శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని దంపతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నాయిని చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నాయిని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత […]

Update: 2020-10-29 04:55 GMT

దిశ, ముషీరాబాద్: మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి గొప్ప కార్మిక నాయకుడని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నేత కందూరు కృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలో నాయిని నరసింహారెడ్డి, అహల్య దంపతుల శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని దంపతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి నాయిని చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నాయిని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News