ఎలక్షన్ డ్యూటీలకు గైర్హాజరు.. 40 మందిపై సస్పెన్షన్ వేటు

పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరు కాని మరో 40 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సస్పెన్షన్ వేటు వేశారు.

Update: 2024-05-08 16:16 GMT

దిశ, సిటీ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలకు హాజరు కాని మరో 40 మంది వివిధ విభాగాలకు చెందిన అధికారులపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎన్నికల శిక్షణకు హాజరుకావాలంటూ ఎన్ని సార్లు మెసేజ్‌లు చేసినా హాజరు కాకపోవటంతోనే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వీరిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం (ఆర్పీ యాక్ట్1951) ఉల్లంఘన కింద వారందరినీ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తిరిగి 9, 10వ తేదీలలో మూడో దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు, ఆ శిక్షణ తరగతులకు గైరాజరైయ్యే వారిపై కూడా ఇదే తరహా చర్యలుంటాయని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.

సస్పెన్షన్ వేటు పడిన అధికారుల వివరాలు

స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు చెందిన కే.యాదవరెడ్డి, ఎం.సుహాసిని, మహ్మద్ సలావుద్దీన్, హఫ్స ఖుద్సీయా, జకీరా షహీన్, గీత, కే.మాధురి, బీ.పావని, సీఆర్.అరుణ కుమారి, ఎస్.మరియా గోరెట్టి, ఆర్.లక్ష్మణ్ కుమార్, శ్రీలత, రవి నిరంజని, ఏ.రాధ, డినాగరాజు, వి.కవిత, సాదిక్ ఉన్నిసా బేగమ్, ఎం.మోహన్ రాజ్, టి.శౌరిలమ్మ, పి.శుభ చైత్ర, ఈ. వేణుగోపాల్, మొహమ్మద్ షమీ యుద్దీన్, మహమ్మద్ అయూబ్ ఖాన్, ఖాజా తాఖీ యుద్దీన్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, కాలేజ్ ఆఫ్ సైన్స్ కు చెందిన జె. వెంకటేశ్వరరావు, డాక్టర్ బి.అశోక్, డాక్టర్  బి. రవీందర్ రెడ్డి, డాక్టర్ పి సోమేశ్వర్, నిజాం కాలేజీకి చెందిన డాక్టర్ ఎం.లక్ష్మణ్, డాక్టర్ అప్క నాగేశ్వరరావు, పరిమళ కులకర్ణి, కోఠి ఉమెన్స్ కళాశాలకు చెందిన డాక్టర్ పీఆర్ సుష్మా, కే దత్తాత్రేయ, డాక్టర్ ప్రియ కుమారి, ఓయూ మెయిన్ క్యాంపస్ కి చెందిన చింతపట్ల శ్రీనివాస్, జి శ్రావన్య, డీఆర్ డీఎల్ కు చెందిన ఎల్. యుగంధర్, కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్‌కు చెందిన సైదా శ్యాం అలియా, కె.సరిత  లను సస్పెండ్ చేయాలని ఆయా శాఖలకు సిఫార్సులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

Tags:    

Similar News