5 భాషల్లో 'కేసరియా' సాంగ్ పాడిన సింగర్.. వీడియోను షేర్ చేసిన ప్రధాని మోడీ

ఓ సింగర్ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. ఆ పాటను ఏకంగా దేశ ప్రధాని మోడీ షేర్ చేశారు.

Update: 2023-03-18 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ సింగర్ పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. ఆ పాటను ఏకంగా దేశ ప్రధాని మోడీ షేర్ చేశారు. స్నేహ దీప్ సింగ్ అనే గాయకుడు కల్సి 'కేసరియా' పాటను మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పాడారు. ఇదికాస్త ఇంటర్నేట్‌లో వైరల్ గా మారడమే కాకుండా భారతీయుల నుంచి ప్రసంశలను అందుకుంటుంది. కాగా ఆ పాటను ప్రధాని మోడీ షేర్ చేస్తూ... ఇది 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి గొప్ప అభివ్యక్తి. అద్భుతమైన పాట అని రాసుకొచ్చాడు. దీనికి స్పందించిన స్నేహదీప్ సింగ్ కల్సి "థాంక్యూ...మీన్స్ చాలా. సో గ్లాడ్ ఇట్ యూ రీచ్ అండ్ యూ ఎంజాయ్‌డ్ ఇట్" అని బదులిచ్చారు.

Tags:    

Similar News