సొంత అన్నను నరికి చంపిన తమ్ముడు

దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఓ వ్యక్తిని అతని సొంత తమ్ముడు అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగటూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య(50), పాండు, రాజులు అన్నాదమ్ముళ్లు. వీరి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వారి […]

Update: 2021-03-05 02:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఓ వ్యక్తిని అతని సొంత తమ్ముడు అతి దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగటూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి… చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య(50), పాండు, రాజులు అన్నాదమ్ముళ్లు. వీరి మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వారి మధ్య భూమి విషయంపై గొడవ జరుగుతుండగా యాదయ్యపై పాండు, రాజులు కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు.

Tags:    

Similar News