విరాట్ నువ్వు సెంచరీ చేసే వరకు పెళ్లి చేసుకోం.. పాక్ అభిమాని

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన మైమరిపించే ఆటతో కోట్లాది మంది- latest Telugu news

Update: 2022-03-22 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన మైమరిపించే ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్ చర్రితలో ఎంతో మంది దిగ్గజాలకు కూడా సాధ్యం కానీ రికార్డ్‌లు సాధించి 'రికార్డ్‌ల రారాజు'గా పేరు గడించాడు. కోహ్లీకి కేవలం భారత్‌లోనే కాకుండా క్రికెట్ ఆడే ప్రపంచ దేశాల్లో అభిమానులు ఉన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌లో కూడా ఈ రన్ మెషిన్‌కు భారీగా అభిమానులున్నారు. అభిమానులే కాకుండా ఎంతో మంది పాక్ యువ ఆటగాళ్లు కూడా కోహ్లీని స్పూర్తిగా తీసుకుంటారు. ప్రస్తుత పాక్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్ సైతం ఎన్నో సందర్భాల్లో కోహ్లీకి తాను అభిమానిని అని చెప్పాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పాక్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటిస్తుంది. కాగా, ఆస్ట్రేలియా, పాక్ మధ్య జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్‌లో ఓ పాకిస్థానీ ఫ్యాన్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకుని.. మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో ' విరాట్ నువ్వు 71వ సెంచరీ చేసే వరకు మేము పెళ్లి చేసుకోం' అని రాసి ఉన్న ప్లకార్డ్ పట్టుకుని నిల్చున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కోహ్లీ అభిమానులు అది క్లోహీ స్టామినా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News