ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రిలీజ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టకేలకు బుధవారం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన షెడ్యూల్ ను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-04-30 16:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టకేలకు బుధవారం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన షెడ్యూల్ ను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1న తాండూరు లో ఆయన ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. మే 2న కర్ణాటక గుల్బర్గా పార్లమెంట్ లో ప్రచారం చేస్తున్నారు. 3న మెదక్ పార్లమెంట్ పరిధిలో, 4న మహారాష్ట్ర సోలాపూర్ పార్లమెంట్ లో ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా ఇప్పటి వరకు బీజేపీ ప్రచారానికి దూరంగా ఉన్న రాజాసింగ్.. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన లకు సైతం దూరంగా ఉన్నారు. తాజాగా ప్రచారంలో పాల్గొంటుండటంతో రాజాసింగ్ అలకవీడారా? లేక తప్పని పరిస్థితుల్లో దిగి వచ్చారా? అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా రాజాసింగ్ అసెంబ్లీ గోషామహల్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. కానీ ఆయన ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొన్నది లేదు.. కనీసం అభ్యర్థిని కలిసింది లేదు. అయితే రాజాసింగ్ ప్రకటించిన షెడ్యూల్ లో మాత్రం హైదరాబాద్ లేకపోవడంతో అక్కడ ప్రచారానికి ఆయన నో చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడి అభ్యర్థిపై ఆది నుంచే రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.


Similar News