వంట వండుతున్నారు.. కానీ, కింద మంటేది ?

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరలవుతోంది. ఆ ఫొటోను..TRS protest photo goes viral on social media

Update: 2022-03-25 03:30 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరలవుతోంది. ఆ ఫొటోను బీజేపీ నేతలు వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కవితతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అక్కడ వంట చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వారు వంట వండుతున్న ఫొటోలను బీజేపీ నేతలతోపాటు నెటిజన్స్ వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పొయ్యి కింద మంట లేకుండానే వంట చేస్తున్నారు.. సూపర్ ఓ సూపర్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 

Tags:    

Similar News