నల్ల బెలూన్ల కేసు.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన రాజీవ్

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్లు ఎగురవేసిన రాజీవ్ రతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Update: 2022-07-07 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనను వ్యతిరేకిస్తూ బ్లాక్ బెలూన్లు ఎగురవేసిన రాజీవ్ రతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గురువారం గన్నవరం పోలీస్ స్టేషన్‌ వచ్చి చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్నారు. కాగా, ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా మోడీ హెలికాఫ్టర్‌లో వెళ్తున్న సమయంలో కొందరు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ప్రధాని భద్రతకు ముప్పు కలిగించేలా నల్ల బెలూన్లు వదిలారని బీజేపీ నేతలు మండిపడుతున్నాయి. దీనికి భద్రత లోపమే కారణమన్నారు. అయితే పోలీసులు మాత్రం భద్రతా లోపంలేదని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటికే కొందరిని అరెస్ట్ చేయగా.. ఇవాళ స్వయంగా వచ్చి రాజీవ్ రతన్ లొంగిపోవడం ఆసక్తిని రేపుతోంది.

Similar News