అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల దూకుడు

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు.

Update: 2024-05-02 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన ఢిల్లీలో పోలీసులు తాజాగా మరోసారి హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ సోషల్ మీడియాకు.. మరోసారి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పలువురిని ఢిల్లీ పోలీసులు విచారించే చాన్స్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు పలువురిని విచారించే అవకాశం ఉన్నందున తదుపరి ఈ కేసులో ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. 

Similar News