'సీతారామం' ప్రీరిలీజ్ వేడుక.. చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్

దిశ, సినిమా : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సీతారామం’.

Update: 2022-07-27 07:49 GMT

దిశ, సినిమా : దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. పాటలు కూడా వినపొంపుగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తున్న చిత్రబృందం.. ఈ వేడుకకు డార్లింగ్ స్టార్ ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే కన్‌ఫర్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 1965 యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News