వందేళ్ల నాటి శివాలయంలో క్షుద్ర పూజల కలకలం..

దిశ, నిడమనూరు : గుప్త నిధుల కోసం క్షుద్ర పూజ - Occult midnight worship at a hundred year old Shiva temple

Update: 2022-07-06 16:08 GMT

దిశ, నిడమనూరు : గుప్త నిధుల కోసం క్షుద్ర పూజ చేసిన సంఘటన మండలంలోని మారుపాక గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మొగుళ్ల శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మారుపాక గ్రామానికి చెందిన నందికొండ నాగలక్ష్మి వ్యవసాయ భూమిని వెంకటాపురం గ్రామానికి చెందిన బొంతల కోటయ్య గత మూడేళ్లుగా కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ నెల 4, 5 వ తేదీల్లో కోటయ్య తమ్ముడు బొంతల శశి కుమార్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి అర్ధరాత్రి సమయంలో నందికొండ సాలమ్మ, నాగలక్ష్మి భూమిలో ఉన్న వందేళ్ల నాటి పురాతన శివాలయం లో క్షుద్ర పూజలు చేశారు. గుప్తనిధుల కోసం శివాలయాన్ని పూర్తిగా జేసీబీతో తవ్వి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన నాగలక్ష్మి బుధవారం నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మొగుళ్ల శోభన్ బాబు తెలిపారు.


Similar News