డాక్టర్లను ఎమర్జెన్సీలో వాడుకుంటున్నారు.. ఆ తర్వాత వదిలేస్తున్నారు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్ వైద్యులను ఎమర్జెన్సీలో వాడుకొని, ఆ తర్వాత వదిలేస్తున్నారని నేషనల్ మెడికల్ అసోసియేషన్..
దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్ వైద్యులను ఎమర్జెన్సీలో వాడుకొని, ఆ తర్వాత వదిలేస్తున్నారని నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఫైరైంది. రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న 25 మంది డాక్టర్లకు ప్రభుత్వం తీవ్ర సమస్యలను సృష్టిస్తుందన్నారు. నోటిఫికేషన్లో హెల్త్ సూపర్వైజర్ అని పేర్కొని, స్టాఫ్ నర్సు హోదా కంటే తక్కువ శాలరీలు ఇస్తున్నారన్నారు. అంతేగాక కొవిడ్ టైంలో పని చేయించుకొని, ఆ తర్వాత కొందరు డాక్టర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలంటూ నేషనల్మెడికల్ అసోసియేషన్శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.